swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 11:10 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  తహసీల్దార్ జయ జయ రావు కు ఘన సన్మానం

కోట స్వర్ణసాగరం జనవరి 28

కోట మండల తాహసిల్దార్ జయ జయ రావు ను ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకటకృష్ణయ్య  బుధవారం ఘనంగా సన్మానించారు.77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ సేవా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా ఆర్ వి ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంబేటీ వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ తాహసిల్దార్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా ప్రశంస పత్రాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఐ.ఎ.ఎస్
చేతుల మీదుగా అందుకోవడం జరిగింది అన్నారు.ఈ సందర్భంగా ఆర్ వి ఫౌండేషన్ తరపున బుధవారం తాహసిల్దార్ ను ఘనంగా సత్కరించడం జరిగింది అన్నారు.గత సంవత్సరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా రాష్ట్రస్థాయి పురస్కారాన్ని కూడా అందుకోవడం  విధి నిర్వహణలో ఆయన సేవా దృక్పథానికి నిదర్శనం అన్నారు.మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మండలంలోని భూ సమస్యల పరిష్కరించడంలో తనదైన స్టైల్ని ప్రదర్శిశిస్తూ తాసిల్దార్ మండల ప్రజల అభిమానాన్ని చురకొంటున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ వి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.