swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 3:47 pm Digital Edition : DAMA VIJAYAKUMAR

జన సైనికుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

కొయ్యలగూడెం స్వర్ణసాగరం:

పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు పిలుపుమేరకు కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెం గ్రామం లో జనసైనికులు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ పంచాయతీ సెక్రటరీ కుమారిని ఆహ్వానించడం జరిగింది. సెక్రటరీ కుమారి మాట్లాడుతూ రాబోయే సంక్రాంతి  పండుగకు కోడి పందాలు పేకాట వంటి జూదాలను దూరంగా ఉండాలని  ప్రజలకు తెలియచేయడం జరిగింది, అలాగే   జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అలాగే ఎమ్మెల్యే బాలరాజు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది,ముగ్గుల పోటీలో గెలిచిన మహిళలకు బహుమతులు అందజేయడం జరిగింది.