swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 2:01 pm Digital Edition : DAMA VIJAYAKUMAR

ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు

వెంకటాచలం స్వర్ణ సాగరం

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఇడిమేపల్లి గిరిజన కాలనీలో మంగళవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు వ్యక్తం చేశారు. ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్ మండల కార్యదర్శి ఎస్ శ్రీహరి ముత్తుకూరు మండల నాయకులు రహీం స్థానికులు కోట్లూరు సుబ్రహ్మణ్యం రామిరెడ్డి స్రవంతి స్థానికులు పాల్గొన్నారు