గ్రామసభలో 113 మంది రైతులకు ఈ-కేవైసీ పూర్తి
స్వర్ణ సాగరం, తొట్టంబేడు, (రిపోర్టర్, రమేష్):
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం రాంబట్లపల్లి గ్రామంలో రీ–సర్వే పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ గ్రామసభను ఘనంగా నిర్వహించారు.ఈ గ్రామసభను తొట్టంబేడు తహసీల్దార్ ఆధ్వర్యంలో, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో, గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రీ–సర్వే ప్రక్రియలో అర్హులైన రైతులకు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామసభలో మొత్తం 113 మంది రైతులకు ఈ–కేవైసీ పూర్తి చేసి పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. రైతులకు భూ హక్కుల పరిరక్షణలో రీ–సర్వే కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.
