swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 4:18 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

వాటర్ ట్యాంక్ శుభ్రం చేసి మా ఆరోగ్యాన్ని కాపాడండి.కోట దళితవాడ ప్రజలు

కోట స్వర్ణసాగరం జనవరి 22

కోట మండలం కోట దళితవాడలోని పంచాయతి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు శుభ్రం చేసి తమ ఆరోగ్యాలను కాపాడాలని కోట దళితవాడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సుమారు 14 నెలలు క్రితం ఓ పత్రికలో వాటర్ ట్యాంకు శుభ్రం చేయాలని ప్రచురించిన కథనం ప్రకారం శుభ్రం చేశారని తిరిగి సుమారుగా ఒకటిన్నర సంవత్సరం గడుస్తున్న ఇప్పటివరకు వాటర్ ట్యాంక్ శుభ్రం చేయలేదని దీనివలన పంచాయతీ నుండి వచ్చే త్రాగునీటిలో చెత్తాచెదారం మలినాలు చిన్నపాటి పురుగులు వంటివి దర్శనమిస్తున్నాయని వాటిని తాగలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని దళితవాడ ప్రజలు వాపోతున్నారు.పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేసి పరిశుభ్రమైన నీటిని అందించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని దళితవాడ ప్రజలు కోరుతున్నారు.