swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 3:55 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

గిరిజన కుటుంబాలకు అండగా టీడీపీ నేత ఉచ్చూరు రవీంద్రనాథ్ రెడ్డి

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 25

కోట మండలం జరుగుమల్లి గిరిజన కాలనీ నిరుపేదలకు టిడిపి నేత ఉచ్చూరు రవీంద్రనాథ్ రెడ్డి అండగా నిలిచారు.ఇటీవల జరుగుమల్లి గిరిజన కాలనీకి చెందిన చెంచయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆదేశాలతో చెంచయ్య ఉత్తర క్రియలు ఖర్చుల నిమిత్తం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు, కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఉచ్చూరు రవీంద్రనాథ్ రెడ్డి చెంచయ్య కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉచ్చూరు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన చెంచయ్య కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు.పంచాయతీ పరిధిలో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఇబ్బందులు వచ్చినా వాటిని పరిష్కరిస్తూ ప్రజలకు అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.