swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 8:13 am Digital Edition : DAMA VIJAYAKUMAR

నలగాంపల్లె లో టిడిపి జండా ఎగరవేసిన టిడిపి నాయకులు

బంగారుపాళ్యం, స్వర్ణసాగరం. మార్చి 29

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలగాంపల్లె గ్రామ సర్పంచ్ షీభా స్వామి దాసు,యం.పి.టి.సి ప్రసన్న విజయ్ ల ఆధ్వర్యంలో నలగాంపల్లె గ్రామంలో యన్.టి.ఆర్.చిత్ర పటానికి పూజలు నిర్వహించి టిడిపి జెండా ఎగురవేసి గ్రామస్థులుకు మిఠాయిలు పంచి పెట్టారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బంగారు పాళ్యం ఎ.యం.సి.మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్య న్.పి.జయచంద్ర నాయుడు, గుంతూరు గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ బి.సి.రవీంద్రనాయుడు, బంగారు పాళ్యం మండల టిడిపి ప్రధాన కార్యదర్శి బుసా జనార్థన్ గౌడ్, టిడిపి సీనియర్ నేత యన్.పి.రాధాక్రిష్ణ, చిత్తూరు పార్లమెంటు టిడిపి ఈడిగ బిసి సాధికార సమితి అధ్యక్షులు బుసా నాగరాజ గౌడ్, టిడిపి నలగాంపల్లె గ్రామ కమిటీ అధ్యక్షులు యన్.పి.కోదండ రామానాయుడు, ప్రధాన కార్యదర్శి బుసా మాధవరావు, ఉపాద్యక్షులు యం.వరదరాజులు, గ్రామ నాయకులు చంద్రయ్య శెట్టి,బుసా గోపినాద్ వార్డు సభ్యులు బుసా సుధాకర్, సావిత్రమ్మ గ్రామయువత పాల్గొన్నారు