కోట స్వర్ణసాగరం మార్చి 21
కోట మండలం కోటలోని ఎన్సిఆర్ నగర్ లో శుక్రవారం స్వర్గస్తులైన బిరదవోలు మస్తాన్ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ శనివారం పరామర్శించారు. బిరదవోలు మస్తాన్ రెడ్డి భౌతికకాయానికి జలీల్ అహ్మద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారికుటుంబ సభ్యులకు అధైర్య పడవద్దని మనోధైర్యాన్ని ఇచ్చారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ బిరదవోలు మస్తాన్ రెడ్డి అందరికీ సుపరిచితుడని,అందరితో స్నేహ భాగంగా మెలుగుతూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారని అన్నారు.అలాంటి మంచి మనిషి లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని అన్నారు.జలీల్ అహ్మద్ వెంట కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు,షేక్ నౌషాద్,పలువురు ఉన్నారు.