కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 27
తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన కుంచం దయాకర్ ఆదివారం సాయంత్రం తిరుపతిలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్తో పాటు పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు.ఈ నేపథ్యంలో కోట మండలం కర్లపూడి గ్రామానికి చెందిన టిడిపి నాయకులు కర్లపూడి రాంబాబు కొంచెం దయాకర్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కర్లపూడి రాంబాబు మాట్లాడుతూ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో తన మామ అయిన కుంచం దయాకర్ ను తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడం సంతోషంగా ఉందని,రాజకీయాలలో తనదైన శైలిలో ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేయగల వ్యక్తి అని కొనియాడారు.