కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 6
ప్రముఖ పారిశ్రామికవేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్ జన్మదినం సందర్భంగా సూళ్లూరుపేట లోని ఆయన నివాసంలో జరిగిన గంగా ప్రసాద్ జన్మదిన వేడుకలలో భాగంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సమక్షంలో కోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి గంగా ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వీట్లు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ దురంధరుడు కొండేపాటి గంగాప్రసాద్ అని అన్నారు.తన సేవాగుణం రాజకీయ జీవితం ఎంతోమంది నాయకులకు ఆదర్శమని అలాంటి మంచి వ్యక్తి జన్మదిన వేడుకలలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.