swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 12:14 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

బీబీజాన్ కుటుంబానికి మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ 5000 రూపాయలు ఆర్ధిక సహాయం

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 5

కోట నేతాజీ వీధిలో మృతి చెందిన బీబీజాన్ కుటుంబానికి మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ తరపున ట్రస్ట్ వ్యవస్ధాపకులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి,ట్రస్టు సభ్యుల చేతుల మీదుగా 5000 ఆర్ధిక సహాయం చేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ అథ్యక్షులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి మాట్లాడుతూ 2026 సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుండి తన నేతృత్వంలో ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందని ఈ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతానికి కోట పంచాయతీ పరిధిలో ఎవరైనా పేద కుటుంబాల్లో వ్యక్తి చనిపోతే   5000 రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను  చేపడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టే పరిధిని విస్తరిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు తూపిలి రాధాకృష్ణారెడ్డి,మర్రి పోలయ్య,మర్రి అనీల్, తిరువీధుల నాగార్జున,సందూరు రాజేష్, డమ్మాయి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.