తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా గూడూరు శాసనసభ్యులు పాశం సునిల్ కుమార్
సునిల్ కుమార్ కు బూర్లవారి పాళెం యువ నాయకుడు పంట్రంగం అరుణ్ కళ్యాణ్ శాలువా, గజ మాలతో ఘన సత్కారం
స్వర్ణసాగరం వాకాడు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గూడూరు శాసన సభ్యులు డా”పాశం సునిల్ కుమార్ నియమితులైన సందర్బంగా మండల పరిధిలోని బుర్లవారిపాళెం యువ నాయకుడు పంట్రంగం అరుణ్ కళ్యాణ్ గూడూరులోని వారి నివాసం వద్ద వ్యక్తిగతంగా కలుసుకుని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి శాలువా, గజ పూలమాలతో సత్కరించారు. ఈ సందర్బంగా అరుణ్ మాట్లాడుతూ మునుముందు అయన మరెన్నో ఉన్నత పదవులను అదిరోహించాలని ఆభగవంతుడిని కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం లో వికాస్, ప్రణిత్, పృద్వి, మస్తాన్, సన్నీ , తదితరులు పాల్గొన్నారు.