కోట స్వర్ణసాగరం మే 6
కోట మండలం పెద్ద గోవిందపల్లి పాళెం గ్రామంలో బుధవారం మత్స్యకారుల జీవనోపాధి కొరకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న బోటు ఇంజన్లు మరియు వలలు అందించే కార్యక్రమానికి విచ్చేసిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ను కర్లపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కర్లపూడి రాంబాబు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కర్లపూడి రాంబాబు మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని,కేవలం ప్రజాసేవ ప్రజా శ్రేయస్సు కొరకే పాటుపడే నాయకుడు సునీల్ కుమార్ దొరకడం గూడూరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అని అన్నారు.ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ చొరవతో సిమెంట్ రోడ్లు,డ్రైనేజీ కాలువలు నూతన ప్రభుత్వ కార్యాలయాల భవనాలు వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని అలాంటి అభివృద్ధి ప్రదాత సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఒక వరమని అన్నారు.