వాకాడు మండల టాప్ గా బాలిరెడ్డి పాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థి ఈ.దేవి ప్రణీత్
వాకాడు స్వర్ణసాగరం ఏప్రిల్ 30
రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి దేవి ప్రణీత్ 517 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచారు. దుగ్గరాజపట్నం విద్యార్థి ఆర్.సుహారిక 515 మార్కులు సాధించి ద్వితీయ స్థానం, మూలపడవ హైస్కూల్ విద్యార్థి కే.ముని కల్పన 514 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు.ఈ సందర్బంగా మండల విద్యాశాఖ అధికారి నాయుమ్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మండలంలో125 విద్యార్థులు పరీక్షలకు హాజరువ్వాగా 78మంది ఉత్తీనులైనారని అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో 70 మందికి 47మంది ఉత్తేర్నలవ్వాగా యోగ నరసింహ 544 మార్కులు సాధించి గురుకుల పాఠశాల టాప్ గా నిలిచారు.ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అభినందనలు ఎంఈఓ తెలియజేశారు.