కొయ్యలగూడెం స్వర్ణసాగరం
సంక్రాతి సంబరాల్లో భాగంగా ఈ రోజు పరింపూడి రామాలయం కమిటీ యువత ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు,ఈ కార్యక్రమం లో మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గులు పోటీలో పాల్గొని విజయవంతం చేశారు. మరియు పోటీలో దాదాపుగా వందమంది పైగా మహిళలు పాల్గొన్నారు,పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ఇవ్వడం జరిగింది. పరింపూడి రామాల యం కమిటీ వారి ఆహ్వానం మేరకు ప్రధమ బహుమతి ముప్పిడి చినబాబు చేతుల మీదుగా అందజేశారు. రెండవ బహుమతి నక్క బాబి అందజేశారు. మూడవ బహుమతి మేడిన కన్నయ్య అందజేశారు. మరియు గ్రామ పెద్దలు,కమిటీ యువత,మహిళలు చేతుల మీదుగా ప్రత్యేక బహుమతులు అందజేయడం జరిగింది.
ముగ్గుల పోటిలను ఏర్పాటు చేసిన పరింపూడి రామాలయం కమిటీ యువత
RELATED ARTICLES



