ePaper
Friday, March 6, 2026
Homeతొట్టంబేడుశ్రీకాళహస్తి దేవస్థానంలో పనబాక లక్ష్మీ ప్రత్యేక దర్శనం,

శ్రీకాళహస్తి దేవస్థానంలో పనబాక లక్ష్మీ ప్రత్యేక దర్శనం,

📰 Generate e-Paper Clip

తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలికి ఘన స్వాగతం – మీడియా కోఆర్డినేటర్ కార్తీక్ నాయుడు సమన్వయం,

స్వర్ణసాగరం -శ్రీకాళహస్తి,

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి దేవస్థానంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనానికి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ విచ్చేశారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కార్తీక్ నాయుడు ప్రత్యేక సమన్వయం చేసి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ప్రత్యేక దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
అనంతరం పనబాక లక్ష్మీ స్వామి–అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవస్థానం తరఫున ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పనపై అధికారులతో ఆమె స్వల్పంగా చర్చించినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, గుర్రపు శెట్టి, తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కార్తీక్ నాయుడు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
భక్తుల రద్దీ మధ్య జరిగిన ఈ కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధల మధ్య సాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular