స్వర్ణసాగరం వాకాడు ఏప్రిల్ 14
అసమానతలు దురహంకారం పై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి డా”బి ఆర్ అంబేద్కర్ అని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పంట్రంగం అరుణ్ కళ్యాణ్ అన్నారు.రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్బంగా మంగళవారం వాకాడు మండల పరిధిలోని బూర్లవరపాలెం గ్రామంలో ఘనముగా నిర్వహించారు.ఈ సందర్బంగా గ్రామంలో ఏర్పాటుచేసిన విగ్రహానికి గజ మాల వేసి పాలాభిషేఖం నిర్వహించారు. అనంతరం అరుణ్ కళ్యాణ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక కులానికి చెందిన వారు కాదని ప్రపంచం గర్వించదగ్గ మేధావని సమానతలు దేశప్రజలందరికి ఒకే విధంగా ఉండాలని ప్రపంచమె అబ్బురపోయేలా రాజ్యాంగాన్ని రచించిన అణగారిన వర్గాల తలరాతలు మార్చారని అయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు చిన్నపిల్లలు పాల్గొన్నారు.



