కోట స్వర్ణసాగరం జనవరి 15
ఇటీవల కోట మండల ఇంచార్జ్ ఎంపీపీ గా పదవి బాధ్యతలు చేపట్టిన వేమారెడ్డి సౌజన్య రెడ్డి ని గురువారం విద్యానగర్లోని వారి నివాసంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రెటరీ మరియు,రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనుపూరు జగదీష్
మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్భంగా కనుపూరు జగదీష్ మాట్లాడుతూ ఎంపీపీ గా కోట మండల ప్రజలకు తమ సేవలు విస్తృతం చేయాలని కోరారు.ఈనేపథ్యంలోనే సౌజన్య రెడ్డి కి కనుపూరు జగదీష్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.



