కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 15
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ బాబు లు నియమించారు.ఈ నేపథ్యంలో
కోట మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,చిట్టేడు పిఎసిఎస్ డైరెక్టర్ చంద్రగిరి మధు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చంద్రగిరి మధు మాట్లాడుతూ కష్టపడేతత్వం ప్రజా శ్రేయస్సు గ్రామాభివృద్దే ముఖ్య ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసే ప్రజా సేవకుడు గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కు పార్టీ అధిష్టానం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు అప్ప చెప్పడం ఎంతో శుభదాయకమన్నారు.సునీల్ కుమార్ కు పదవి రావడానికి సహకరించిన మంత్రులకు నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.



