ePaper
Wednesday, June 3, 2026
Homeఎడిటోరియల్తెలుగు చైతన్య వేదిక అభినందన పత్రం అందుకున్న తిరుమూరు మురళి

తెలుగు చైతన్య వేదిక అభినందన పత్రం అందుకున్న తిరుమూరు మురళి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మే 23

కోట మండలం కొత్తపట్నం గ్రామానికి చెందిన కోట మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు మరియు 33వ యూనిట్ ఇంచార్జ్ తిరుమూరు మురళి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ చేతులు మీదుగా శనివారం మంగళగిరిలో తెలుగు చైతన్య వేదిక అభినందన పత్రం అందుకున్నారు.తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్చార్జిల శిక్షణా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూరు మురళికి తెలుగు చైతన్య వేదిక అభినందన పత్రం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు మురళి స్నేహితులు,బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular