📍 మనుబోలు, స్వర్ణ సాగరం :
మనుబోలు మండలం లక్ష్మీ నరసింహపురం లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ట కార్యక్రమమును ఈనెల 31 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గ్రామ కమిటీ తెలిపింది. ఆలయంలో పురాతన కాలం నాటి ద్వజ స్తంభం శిధిలావస్థకు చేరుకుంది. దీనితో గ్రామస్తులు సహకారంతో నూతన ధ్వజస్తంభాన్ని తీసుకుని వచ్చిన వినుకొండ రాజీవ్ చక్రవర్తి ఆధ్వర్యంలో పునః జీవ ధ్వజ ప్రతిష్ట మహా కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.



