కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 20
కోట మండలం కోట ప్రాంతానికి చెందిన వైసీపీ నేత పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడు, నమ్మిన బంటు కృష్ణారెడ్డి సునీల్ రెడ్డి ని వైసీపీ అధిష్టానం నెల్లూరు జిల్లా యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించింది.పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ పార్టీ బలోపేతానికి సునీల్ రెడ్డి చేసిన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి జిల్లా యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించడం పట్ల ఆయన అనుచరులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి సునీల్ రెడ్డి మాట్లాడుతూ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.ఆయనకి పదవి రావడానికి కృషిచేసిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి కి రుణపడి ఉంటానని,ధన్యవాదములు తెలిపారు.



