కోట స్వర్ణసాగరం మార్చి 19
తెలుగుదేశం పార్టీ కోట మండల ప్రధాన కార్యదర్శి జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర పరిశీలకులు,డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు కి కోట మండల సోషల్ మీడియా అధ్యక్షులు మీజూరు మధుబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మధుబాబు మాట్లాడుతూ ప్రజా సేవకుడు స్నేహశీలి మా కోటి అన్న తెలుగుదేశం పార్టీలో కోట పట్టణ తెలుగు యువత అధ్యక్షులుగా రెండుసార్లు కోట మండల సోషల్ మీడియా అధ్యక్షులుగా ఒకసారి గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఒకసారి ఇప్పుడు మండల ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలు అందిస్తున్నారని అలాగే జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర పరిశీలకులుగా గత మూడు సంవత్సరాలుగా సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు.ఆయన చేసిన పలు సేవలకు గాను 2023లో డాక్టరేట్ కూడా పొందారని తెలుగుదేశం పార్టీలో నా ప్రియతమ నాయకులు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ సహకారంతో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు జలీల్ అహ్మద్ సహకారంతో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.



