కోట స్వర్ణసాగరం మే 20
కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డికి కోట జర్నలిస్టులు కోడూరు రాము,కట్టా జనార్ధన్, పాకం చెన్నకేశవులు బుధవారం విద్యానగర్ లోని మోహన్ రెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ కోడూరు రాము మాట్లాడుతూ మంచి మనసున్న వ్యక్తి,ఆపద సమయంలో నేనున్నానంటూ భరోసా ఇస్తూ అండగా నిలబడే మనస్తత్వం కలిగిన ప్రజా సేవకుడు నెల్లూరు మోహన్ రెడ్డికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందన్నారు. ఆ భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మంచి జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు.



