ePaper
Friday, July 31, 2026
Homeఎడిటోరియల్వీరారెడ్డి సత్రంలో శివరాత్రి సందర్భంగా ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన

వీరారెడ్డి సత్రంలో శివరాత్రి సందర్భంగా ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 13

శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని కోట మండలం వీరారెడ్డి సత్రం వద్ద ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మల్లు భాస్కర్ రెడ్డి,మల్లికార్జున గౌడ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ 14 తేదీ శనివారం ఉదయం 8 గంటలకు వీరారెడ్డి సత్రం వద్ద ఈ బలప్రదర్శన జరుగుతుందన్నారు.కోట,వాకాడు,చిట్టమూరు, గూడూరు,చిల్లకూరు మండలాల నుంచి ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉత్సాహకులు ఎంట్రీ ఫీ 500 చెల్లించాలని పేర్కొన్నారు.ఎడ్ల బల ప్రదర్శనలో ప్రథమ బహుమతి 30000,ద్వితీయ బహుమతి 20000,తృతీయ బహుమతి 10000,చతుర్ద బహుమతి5000,పంచమ బహుమతి 3000 ప్రకటించామన్నారు.మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న సాంస్కృతి కార్యక్రమం కార్యక్రమంలో మండలాలలోని ప్రజలు పాల్గొని విజయవంతం కోరుతున్నామన్నారు.వివరాలకు 7288998999,9959220092,నెంబర్లను సంప్రదించలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular