కోట స్వర్ణసాగరం జనవరి 12
ఇటీవల నేషనల్ ఆర్.టి.ఐ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ లో పాకం చెన్నకేశవుల కు జోనల్ మీడియా కార్యదర్శిగా,కట్టా జనార్ధన్ కు మీడియా కోఆర్డినేటర్ గా వీరిద్దరిని నాలుగు జిల్లాలు కలిపి నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడమైనది వీరి సేవలు మరింత ఉధృతం చేయాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను కూడా కలిపి ఏకంగా ఐదు జిల్లాలకు అదనపు బాధ్యతలు ఇస్తూ హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ షేక్ జిలానీ భాషా సోమవారం ఆదేశాలు జారీ చేశారు.ఇకనుంచి తిరుపతి, చిత్తూరు,కడప,అన్నమయ్య నాలుగు జిల్లాలతో పాటు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కూడా మొత్తం ఐదు జిల్లాలకు మీడియా జోనల్ కార్యదర్శిగా పాకం చెన్నకేశవులు,మీడియా కోఆర్డినేటర్ గా కట్టా జనార్దన్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ జిలానీ భాషా తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకంతో ఇంత పెద్ద పదవి బాధ్యతలు అప్పగించిన హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ షేక్ జిలాని భాష కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.తమ బాధ్యతల పట్ల విశ్వాసంతో నమ్మకంతో పనిచేసి సంస్థకు మంచి పేరు తీసుకుని వస్తానని తెలిపారు.



