స్వర్ణసాగరం, వరదయ్యపాళెం :
సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఆదిమూలం సంక్రాంతి శుభాకాంక్షలు మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే ఆదిమూలం సంక్రాంతి శుభాకాంక్షలు వరదయ్య పాలెం స్వర్ణ సాగరం జనవరి 13గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.సంక్రాంతిని పురస్కరించుకొని మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారి పల్లెకు చేరుకున్నారు. ఈ క్రమంలో నారావారి పల్లె హెలిప్యాడ్ వద్ద వేచి ఉన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలుసుకొని స్వాగతం పలికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని ఎమ్మెల్యే ఆదిమూలం మర్యాద పూర్వకంగా కలుసుకొని బోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆప్యాయం గా పలకరించడం గమనార్హం.



