వరదయ్యపాలెం,స్వర్ణ సాగరం మార్చి 7
వరదయ్య పాలెం మండలం ఇందిరానగర్ కాలనీ సమీపంలో డంపింగ్ యార్డ్ వద్ద పరారీలో ఉన్న ముద్దాయిలను శనివారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు అరెస్ట్ చేసిన వరదయ్యపాలెం పోలీసులు, పట్టుబడిన వారిలో ముద్దాయిలు అనిల్ కుమార్, వివేకానంద, శ్రీనివాసులు, చెంచయ్య అనేవాళ్లు ఉండగా వీరు గంజాయి కొని వాళ్ళు వాడుకుంటూ అమ్ముతూ ఉంటారని ఈ సందర్భంగా ఎస్సై మల్లికార్జున తెలియజేశారు. ఈ దాడిలో ఎస్ఐ మల్లికార్జున తో పాటు, సిబ్బంది సాయిబాబా,సుబ్రమణ్యం ,హరిప్రసాద్, గణేష్, కిరణ్ కుమార్, శివప్రసాద్ మొదలైన వారు పాల్గొన్నారు.




