కోట స్వర్ణసాగరం మార్చి 19
గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు కోట మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,చిట్టేడు పిఎసిఎస్ డైరెక్టర్ చంద్రగిరి మధు మరియు టీడీపీ నాయకులు పిఎసియస్ చైర్మన్ చాపల శ్రీనివాసులు గురువారం ఉగాది,రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.కోటలో ఎస్ కే బి ఆవరణంలో గ్రీన్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను చంద్రగిరి మధు, చాపల శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు శాలువాలతో సత్కరించి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.



